28 February, 2026 | 8:57 PM

సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించిన జెడ్పిహెచ్ఎస్ పెంచికల్ పేట

28-02-2026 05:24 PM

పెంచికల్పేట,(విజయక్రాంతి): పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పెంచికల్పేట పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలు, శాస్త్ర సంబంధిత కార్యక్రమాలు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు.

అనంతరం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, ఉపాధ్యాయులు యాదగిరి, భారతి, భాగ్యశ్రీ, ఉజ్వల, ఆత్మారాం, గంగభవాని, సమ్మయ్య, సంతోష్, లక్ష్మి, నాగరాణి, విజయ్, మౌనిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.