15 June, 2026 | 9:58 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పట్టుపురుగు పెంపకంలో సాంకేతిక ఈ యజమాన్య పద్ధతులు పాటించాలి

19-07-2024 01:09 PM

పట్టు పరిశ్రమ ములుగు సైంటిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్

హుజురాబాద్: పట్టు పురుగుల పెంపకంలో సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించి మంచి లాభాలు పొందవచ్చని పట్టు పరిశ్రమ శాఖ ములుగు సైంటిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం హుజరాబాద్ మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో పట్టుపురుగుల కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. సాగు చేస్తున్న రైతులను వివరాలను తెలుసుకున్నారు. పురుగుల పెంపకంలో రైతులకు పలు సాంకేతిక అంశాలను తెలియజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువులు వేసే విధానం, రూట్ రాట్ వేరు కుళ్ళు, తుక్రా వ్యాధి నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. పట్టుపురుగుల పెంపకంలో అవసరమైన సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించడం లేదని, దీనివల్ల పట్టు పురుగులకు పాలు కారు రోగం, సున్నపుకట్టు, ప్లాచరీ (సచ్చు రోగం), పెబ్రిన్ మొదలగు వ్యాధుల ద్వారానే కాకుండా ఊజీ ఈగ తాకిడి వల్ల కూడా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని వినోద్ కుమార్ తెలిపారు.