03-06-2025 10:37:43 AM
ఎల్లారెడ్డి కి చెందిన మధుకర్ గౌడ్ శవం లభ్యం
ఆచూకీ లభించని ఇద్దరి యువకులు
ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ అధికారుల గాలింపు చర్యలు
అర్ధరాత్రి వరకు కొనసాగిన లభించని అచూకీ
ఉదయం మధుకర్ గౌడ్ మృత దేహం లభ్యం
మరో ఇద్దరి యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో సోమవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురు యువకులలో ఒక యువకుని అచూకీ మంగళవారం ఉదయం లభించింది. మరో ఇద్దరు యువకుల జాడ కనిపించలేదు. వారికోసం రెస్క్యూటీం, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది అర్ధరాత్రి వరకు గాలించిన ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించారు. సోమవారం క్రికెట్ ఆట కోసం వెళ్ళిన 11 మంది యువకుల్లో 8 మంది ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు యువకులు మాత్రం గల్లంతయ్యారు. ఈ విషయాన్ని తోటి మిత్రులు ఆ యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు, అగ్నిమాపకశాఖ రెస్క్యూ టీం తో గాలింపు చర్యలు చేపట్టారు.
యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి వరకు వేచి చూసిన తమ పిల్లల ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉదయం నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ఒడ్డున కూర్చుని దినంగా రోధిస్తూ ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎల్లారెడ్డి కి చెందిన మధుకర్ గౌడ్ అనే యువకుని శవం ఉదయం లభించింది. మరో ఇద్దరి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్థానిక పోలీసులు తెలిపారు. రజయితగాళ్లు, రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖ సిబ్బంది గాలింపు చేపడుతున్నారు. యువకుల ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగుతుందని నిజాంసాగర్ పోలీసులు తెలిపారు.