31 May, 2026 | 2:07 AM

దోస్త్ ఫేజ్2లో 52,302 మందికి సీట్లు

31-05-2026 01:30 AM

నేటి నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): దోస్త్ రెండో విడత సీట్లను కేటాయించారు. మొత్తం 52,302 మంది సీట్లు పొందారు. కామర్స్‌లో 21,431, ఫిజికల్ సైన్సెస్‌లో 15,245 మంది, లైఫ్ సైన్సెస్‌లో 9,664 మంది, ఆర్ట్స్‌లో 5955 మంది, ఇతరులు ఏడుగురు సీట్లు పొందారు. ఆదివారం నుంచి జూన్ 5 వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫేజ్3 రిజిస్ట్రేషన్లు ఆదివారం నుంచి జూన్ 16 వరకు చేసుకోవ చ్చు. సీట్ల కేటాయింపు జూన్ 20న కేటాయించనున్నారు.