డీఈఈ సెట్ ఫలితాలు విడుదల
7918 మంది ఉత్తీర్ణత
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): డీఈఈసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. తెలుగు మీడియం కోర్సుకు 12,373 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 9612 మంది పరీక్షకు హాజరుకాగా, 7918 (82.37 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కోర్సులో తొలి ర్యాంకును బి. ఆనందు సాధించారు. ఇంగ్లీష్ మీడియానికి 18,985 మంది దరఖాస్తు చేసుకోగా, అందు లో 14,414 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 12,784 (88.69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ కోర్సులో ఫస్ట్ ర్యాంకు ను జవ్వాజి శివ నాగేశ్వర్ సాధించారు. ఉర్దూమీడియానికి 1234 మంది దరఖాస్తు చేసుకో గా, 1028 మంది పరీక్ష రాస్తే 435 (42.31 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో దానిష్ అహ్మద్ తొలి ర్యాంకును సాధించారు. జూన్ 2 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని డీఈఈ సెట్ కన్వీనర్ జి.రమేష్ తెలిపారు. వెబ్ఆప్షన్ల్ల నమోదు జూ న్ 6 నుంచి 8 వరకు అవకాశం కల్పించారు.






