28-06-2025 01:43:10 AM
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 720 సీట్లు భర్తీకానున్నాయి. కౌన్సిలింగ్ ద్వారా ఆయా సీట్లు భర్తీ అవుతాయని శుక్రవారం సాంకేతిక విద్యాకమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వు ప్రకారం.. హుస్నాబాద్లోని శాతవాహన వర్సిటీ కాలేజీలో 240 సీట్లు, మహబూబ్నగర్ పాలమూరు వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో 180 సీట్లు, కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ వర్సిటీలో 300 సీట్లు భర్తీ కానున్నాయి. ఆయా కాలేజీలు విద్యార్థులకు సీఎస్ఈ, సీఎస్ఏ, ఈసీఈ, సీఎస్ఎం, సీఎస్డీ, ఈఈఈ, ఐఎన్ఎఫ్, మైనింగ్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి.