28-06-2025 01:45:11 AM
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. శుక్రవారం హైటెక్స్లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోను ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ...
ఎంఎస్ఎంఈ పాలసీ అమలు చేయడంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామ ర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) కీలక పాత్ర పోషించాలని సూచించారు. బలమైన ఎంఎస్ఎంఈ నెట్వర్క్ను వినియోగించుకుని కార్యా చరణ పద్ధతులు రూపొందించాలని తెలిపా రు. ఆధునిక పరిశ్రమలు స్టార్టప్ల ఆధారంగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు.
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలతో సహా పరిశ్రమల ఎకోసిస్టమ్ ఈ ఎక్స్పోలో ప్రాతినిధ్యం వహించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు సురేష్కుమార్ సింగా ల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్, ఎక్స్పో కన్వీనర్ విమ్లేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.