28-06-2025 01:40:27 AM
డీఎంఈకు జూడాల వినతిపత్రం
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదివే వైద్య విద్యార్థులకు ప్రతినెలా 10వ తేదీ లోపు స్టుఫైండ్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు శుక్రవారం డీఎంఈకి వినతి పత్రం ఇచ్చారు. జీవో నెంబర్ 59 ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి పెంచాల్సిన స్టుఫైండ్స్ను నేటికీ పెంచడం లేదని ఈ విషయంలోనూ చొరవ చూపాలని కోరారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వసతుల లేమి వేధిస్తోందని.. వెంటనే ఆ మేరకు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టుఫైండ్స్ చెల్లించకుండా వేధిస్తున్నారని ఈ అంశంపై వెంటనే తగిన చర్యలు తీసుకునాలని జూనియర్ డాక్టర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జే ఇసాక్ న్యూటన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్కుమార్ గౌడ్, చైర్పర్సన్ డాక్టర్ కే మదన్కుమార్ డీఎంఈకి వినతిపత్రం సమర్పించారు.