31-05-2025 12:00:00 AM
- షేర్ల విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన కేసులో
న్యూఢిల్లీ, మే 30: షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా 59 మందిపై సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కఠిన చర్యలు తీసుకుంది.
స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టకుండా ఏడా ది పాటు వీరందరిపై నిషేధం విధిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లు సిఫారసు చేస్తూ యూ ట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ సహా ఆయన భార్య మారియాకు చెరో రూ. 5 లక్షల జరిమానా విధించింది.
మిగతా 57 మందిపై రూ.5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.