31-05-2025 12:00:00 AM
- పహల్గాం బాధితుడు శుభమ్ ద్వివేది కుటుంబాన్ని కలిసిన ప్రధాని
- పాక్ వాయుస్థావరాలను నిమిషంలో ధ్వంసం చేశాం
- బీహార్ బహిరంగ సభలో పాక్పై నిప్పులు చెరిగిన మోదీ
కాన్పూర్, మే 30: ‘ఉగ్రవాదంపై పోరు ఇంకా ముగియలేదు.’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం కాన్పూర్లో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కాన్పూర్కు చెందిన శుభమ్ ద్వివేది కుటుంబసభ్యులు ప్రధాని మోదీ ని చకేరి విమానాశ్రయం (కాన్పూర్)లో కలుసుకున్నారు.
దేశం మొత్తం మీ వెంటే ఉందని ప్రధాని తమకు ఎంతో భరోసానిచ్చారని శుభమ్ ద్వివేది భార్య ఐశన్య తెలిపారు. ‘ఈ దుర్ఘటన పట్ల ప్రధాని ఎం తో బాధతో ఉన్నారు. ఒక కుటుంబసభ్యుడిలా ఆయన మాతో మాట్లాడారు. మొ త్తం దేశంతో పాటు ప్రభుత్వం కూడా మా వెంట ఉందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరు ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు.’ అని ప్రధాని తమతో అన్నట్టు ఐశన్య మీడియాకు వివరించారు.
పాక్ వైమానిక స్థావరాల్ని నిమిషాల్లో కూల్చేశాం
పాకిస్థాన్కు చెందిన వైమానిక స్థావరాలను భారత సైన్యం నిమిషాల్లో ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు.
‘పాకి స్థాన్లో ఉన్న వైమానిక స్థావరాలను నిమిషాల్లో ధ్వం సం చేశాం. వైమానిక స్థావరాలతో పాటు అక్రమంగా దాక్కున్న టెర్రరిస్టుల స్థావరాలను కూడా నేలకూల్చాం. ఇది భారత్ శక్తి సామర్థ్యం. పహల్గాం దాడి జరిగిన రెం డ్రోజుల తర్వాత బీహార్ పర్యటనకు వచ్చినపు డు.. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్ష వేస్తామని ఈ గడ్డ మీద దేశానికి హామీనిచ్చా.
ఆ హామీని నెరవేర్చిన తర్వాతే మరలా బీహార్ పర్యటనకు వచ్చా. సిందూర్ శక్తేంటో పాకిస్థాన్తో పాటు ప్రపంచం మొత్తం చూసింది. ఉగ్రవాదంపై మన యుద్ధం ముగియలేదు. మరోసారి భారత్పై ఉగ్రదాడి జరిగితే భారత్ దాన్ని మరోసారి తుంచేస్తుంది.’ అని మోదీ పేర్కొన్నారు.
బ్రహ్మోస్ దెబ్బకు పాక్ విలవిల
భారత్ సొంత సాంకేతికతతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్కు నిద్రలేని రాత్రులు మిగిల్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో రూ. 47,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని ప్రసగించారు. ‘భారత్ సొంత సాంకేతికతతో తయారు చేసిన “బ్రహ్మోస్” శత్రువు భూభాగంలోకి ప్రవేశించి శత్రువుల వెన్నులో వణుకుపుట్టించింది.’ అన్నారు.