calender_icon.png 15 June, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

180 బస్తాల నల్ల బెల్లం పట్టివేత

14-06-2025 11:02:27 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): నాటు సారా తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుండి మహబూబాబాద్ కు లారీలో తరలిస్తున్న 180 బస్తాల నల్ల బెల్లం, 10 క్వింటాల పటిక, 60 లీటర్ల నాటు సారా, రెండు మొబైల్ ఫోన్లను మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి(Excise CI Chiranjeevi) ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారు. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అనంతరం నుండి మొగిలిచర్ల మధ్య ఉన్న అటవీ ప్రాంతాల్లో నాటు స్థావరాలపై దాడులు నిర్వహించి నాటు సారా తయారీకి సిద్ధం చేసిన 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

ఈ సంఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఈ సంఘటనలో మరో వ్యక్తి ఫరారిలో ఉన్నట్లు చెప్పారు. 20 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ చిరంజీవి, ఎస్ ఐ అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మధు, శేఖర్, షాలెం రాజు, శ్రీనివాస్, రవి, వెంకట్ నర్సయ్య, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో నల్ల బెల్లం, పట్టిక, లారీ స్వాధీనం చేసుకోవడంపై వరంగల్ ఎక్సైజ్ డీ సీ అంజన్ రావు, డిపి ఈవో కిరణ్ అభినందించారు.