14-06-2025 11:04:22 PM
అనంతగిరి: అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ సీతారాం నాయక్(Former MP Seetaram Naik) పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో వికాసిత్ భారత్ 2047 కలను సహకారం చేసేలా అన్ని రంగాల్లో దేశాన్ని ఆత్మ నిర్బార్ భారత్ దిశగా శరవేగంగా అడుగులు వేసేందుకు కార్మికుల భాగస్వామ్యం అవసరమన్నారు. శనివారం అనంతగిరి మండలం కొత్త గోల్ తండా గ్రామంలో గిరిజన మోర్చా నియోజకవర్గ ఇన్చార్జి బానోతు అనుష ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్టి మోర్చా రచ్చబండ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బంజారా కార్మికుల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు... ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి, కన్వీనర్ అక్కిరాజు యశ్వంత్, కన్వీనర్ కనగాల నారాయణ, బొల్లి శెట్టి కృష్ణయ్య, ఏలేటి వెంకటేశ్వర్ రెడ్డి, పగిడి రామారావు, ఎడ్లపల్లి రామారావు, సిద్దయ్య, వరయ్య, జిల్లా జనార్ధన్, పురుషోత్తం, కోదాడ రూరల్ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు, చిలుకూరు మండల అధ్యక్షుడు మహేష్, నడిగూడెం మండల అధ్యక్షులు వీరబాబు, నాగేశ్వరరావు, లచ్చు నాయక్, మండల నాయకులు బూతు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.