30 April, 2026 | 12:20 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

07-03-2026 01:14 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మార్చి 6: మండల పరిధిలోని రామన్నగూడెం ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా మారి వివిధ పాత్రలతో అలరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కర్నాటి వెంకన్న హాజరై విద్యార్థులకు మెమెంటోలతో పాటు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగంపల్లి రవిందర్, పాఠశాల హెచ్‌ఎం నీరజ, రిటైర్డ్ హెచ్‌ఎం ధర్మయ్య, ఉపాధ్యాయులు వెంకన్న, సుధారాణి, అంగన్వాడీ టీచర్ పుష్పలత, ఏఎన్‌ఎం గిరిజ, ఆశా కార్యకర్త శైలజ, విద్యార్డులు పాల్గొన్నారు.