మీలా సేవలు మరువలేనివి
- మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్
సూర్యాపేట, జూన్25(విజయక్రాంతి): సుధాకర్ పీవీసీ అధినేత మీలా సత్యనారయణ సేవలు మరువలేనివని సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ అన్నారు. మంగళవారం మీలా అయిదో వర్ధంతి సందర్భంగా శాంతినగర్లో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీలా సత్యనారాయణ రాజకీయ వేత్తగా, వ్యాపారవేత్తగా మచ్చలేని నాయకునిగా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. స్వతంత్య్ర సమరయోధుడిగా, ఉపాధ్యాయుడిగా, సామాజికవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. సుధాకర్ పీవీసీ స్థాపించి దేశ వ్యాప్తంగా పేరుపొందిన గొప్ప వ్యక్తి మీలా అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిరెడ్డి రాజా, పెద్దిరెడ్డి గణేశ్, పీవీసీ అధినేతలు మీలా మహదేవ్, మీలా జయదేవ్, మీలా వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.






