calender_icon.png 30 May, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురుగు కాలువల్లో పూడికలు తీయాలి

28-05-2025 01:33:40 AM

 క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి 

నిజామాబాద్, మే 27, (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి స్థాయిలో శుభ్రం చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. 

మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణులతో కలిసి కలెక్టర్ నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్య కూడళ్లలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు.

బైపాస్ రోడ్డులోని ఉర్దూ మీడియం స్కూల్ సమీపంలోని డ్రైనేజీని, నిజామ్ కాలనీలోని డ్రైనేజీని, బోధన్ రోడ్ లోని రిలయన్స్ పెట్రోల్ బ్యాంకు సమీపంలో గల మురుగు కాల్వను, రాజరాజేంద్ర చౌరస్తా నుండి పీ.ఎఫ్ కార్యాలయం వరకు గల డ్రైనేజీని, సాయినగర్ రోడ్-నెంబర్ 1 లో గల మురుగు కాల్వను, తీన్ కమాన్ నుండి ఐ.డీ.ఓ.సి వరకు గల డ్రైనేజి, వినాయకనగర్ లోని బస్వా గార్డెన్ సమీపంలో గల మురుగు కాల్వను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. 

పలుచోట్ల డ్రైనేజీలను ఆక్రమించుకుని నిర్మాణాలు కలిగి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు.   కలెక్టర్ వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈ.ఈ ఆనంద్ సాగర్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.