calender_icon.png 31 May, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు

30-05-2025 03:12:23 AM

  1. సంస్థాగత ఎన్నికల్లో సత్తా చాటండి.. పార్టీని గెలిపించండి..
  2. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
  3. రెండోరోజు మూడు పార్లమెంట్ సెగ్మెంట్ల నేతలతో సమీక్ష 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, నిబద్ధతతో పనిచేసే వారికే పదవులు కట్టబెడతామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆమె ఆ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రెండోరోజు గురువారం ఆమె హైదరాబాద్‌లో మహబూబ్‌నగర్, హైదరాబాద్, చేవేళ్ల పార్ల మెంట్ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీలు, నాయకులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయి కావాలని, అందుకు పార్టీ శ్రేణులు శాయశక్తులా పనిచే యాలని పిలుపునిచ్చారు. నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలుంటే, వాటిని పరిష్కరించుకోవాలని హితవు పలికారు. లేదంటే తన దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఆమె ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎలాంటి అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుం ది? రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత మేరకు చేరవవుతున్నాయి? పార్టీ బలోపేతానికి నేతలు తీసు కుంటున్న చర్యలను ఆమె నేతల ద్వారా తెలుసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీపరంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రంగారెడ్డి  జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పలువురు మీనాక్షిని కోరినట్లు సమాచారం.