25 February, 2026 | 6:58 PM

షీ టీమ్ అవగాహన కార్యక్రమం

25-02-2026 05:04 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఖీరిడి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరీక్షల సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని సూచించారు.

సోషల్ మీడియా, ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు వివరించారు. సహాయం అవసరమైతే 8712670564 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తుకారం, ఎస్సై బిక్కులాల్, సిబ్బంది స్వప్న, రజని, దినేష్ పాల్గొన్నారు.