12 March, 2026 | 10:10 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

వెంచర్‌లోకి గొర్రెలు వెళ్లాయని కాపరులపై దాడి

02-11-2024 02:38 AM

నాగర్‌కర్నూల్‌లో రియల్టర్ల దాష్టీకం

నాగర్‌కర్నూల్, నవంబర్ 1(విజయక్రాంతి): వెంచర్ నుంచి గొర్రెల మంద వెళ్లిందని కొందరు రియల్టర్లు గొర్రెల కాపరులపై కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బొందలపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మేత కోసం తమ గొర్రెల మందను శుక్రవారం బస్ డిపో ప్రాంతం నుంచి నాగనూలు రోడ్డు వైపు ఉన్న వెంచర్ వైపు మళ్లించారు.

దీంతో కొందరు రియల్టర్లు తమ వెంచర్ల మీదుగా గొర్రెల మందను తీసుకెళాతారా? అంటూ గొర్రెల కాపరులపై కర్రలు, రాళ్లతో వెంటపడి దాడి చేశారు. దాడిలో కత్టె రాముడు, బాల్ చంద్రితో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.