20-02-2026 12:00:00 AM
నంగునూరు,ఫిబ్రవరి 1౯: మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఆరెక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి, బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆరెక్షత్రియ సంఘం మండల అధ్యక్షుడు,గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్ మా ట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్యవాదులను ఎదిరించి, భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు శివాజీ అని కొనియాడారు.
క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూనే రైతు సంక్షేమం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, వార్డు సభ్యులు సత్తయ్య, ఎర్ర బాబు గ్రామస్తులు రవీంద్ర చారి,కృష్ణమూర్తి, తిరుపతి, జయరాములు, నర్సింగరావు, రంకు అశోక్, రమేష్, రామారావు, బిక్షపతి, రాజేశం, రమేష్, రాజులు, చింతం రాజు, యాదగిరి, కనకరాజు, శివ, ఆరెక్షత్రియ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.