బోనాలలో శివసత్తులకు ప్రాతినిధ్యం ఇవ్వాలి
22-06-2024 12:05 AM
మంత్రి సురేఖకు జోగిని శ్యామల విన్నపం
హైదరాబాద్, 21 జూన్ (విజయక్రాంతి): ఆషాఢమాసం బోనాల ఉత్సవ కమిటీలో శివసత్తుల సంక్షేమ సంఘం సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని సంఘం అధ్యక్షురాలు జోగిని కొలిపాక శ్యామల ప్రభుత్వాన్ని కోరారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ అస్థిత్వానికి ప్రభుత్వగుర్తింపు అవసరమన్నారు. శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు.






