రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి
28-06-2024 10:37 PM
మంచిర్యాల, జూన్ 28 (విజయక్రాంతి): క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. శుక్రవారం మంచిర్యా లలో ఉమ్మడి ఆదిలాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిక్స్ సన్రైస్ సీనియర్స్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను డీఎఫ్వో శివ్ఆశీష్తో కలిసి ప్రారంభించానే. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం జాయింట్ సెక్రటరీ బాబు, టోర్నమెంటు కన్వీనర్ ముఖేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




