20-05-2025 12:00:00 AM
చెరువుకు ఎఫ్టీఎల్ హద్దులు, బఫర్జోన్లు ఎప్పుడు గుర్తిస్తారు
కబ్జా చేస్తున్నా పట్టించుకోని కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే
పగలు, రాత్రి తవ్వకాలు.. ఐనా స్పందించని అధికారులు..
మత్స్యకారులు, చెరువు పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరిక
లక్షేట్టిపేట, మే 19: చెరువు పరిరక్షణ విషయంలో రైతులకు, మత్స్యకారులకు న్యా యం జరుగకపోతే హైడ్రాతో పాటు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మ త్స్యకారులు, చెరువు పరిరక్షణ సమితి కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెద్ద చెరువుకు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల హద్దులను గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.
సోమవారం ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మత్స్య సహకార సం ఘం నాయకులు శాకపురం పోశయ్య, మేడి రాజేష్, మేడి నారాయణ, చెరువు పరిరక్షణ సమితి కన్వీనర్ సప్ప రవితో పాటు పలువు రు నాయకులు మాట్లాడారు. గత పదేళ్లుగా ఇటిక్యాల చెరువు అన్యాక్రాంతం అవుతుందని సంబంధిత శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి సమస్యను పరిష్కరించాలని కోరితే పట్టించుకోవ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్ కుమార్ దీపక్ మత్స్యకారుల, రైతులు వైపు నిలవడం లేదని, గతంలో ఏ కలెక్టర్కు దగ్గరికి వెళ్లి సమస్యను ప్రస్తావిస్తే వెంటనే సం బంధిత అధికారులను పిలిపించి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేసేవారని, కానీ ఈ కలెక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. స్వయంగా కలెక్టర్ మమ్మల్నే మీరు మత్స్యకారులా? రైతులా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని, ప్రెస్ వాళ్ళ ను ఫోటోలు, వీడియోలు తీయవద్దు, మీరు జర్నలిస్ట్ లేనా అంటూ ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువు సమస్యను పరి ష్కరించాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్కు వినతి పత్రం ఇచ్చే క్రమంలో ఎమ్మెల్యే కంటే ముం దే కలెక్టర్ సర్ది చెప్పడం, మట్టిని తడి ఆరిపోయాక తరలిస్తారంటూ పక్క దోవ పట్టించా రన్నారు. ఇన్ని రోజులు మట్టి కుప్పలు చెరువులో ఉంచి మేం ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే తొలగించేలా చర్యలు తీసుకోవడం ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కాదా? అని మండిపడ్డారు.
స్వయంగా కలెక్టర్ మట్టిని తడిఆరిపోయాక తరలిస్తారని చెప్పారు కానీ నేటికీ తరలింపు ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. ఇప్పటికి మట్టి తరలింపు విషయంలో కలెక్టర్ ఆదేశాలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటుకల తయారీకి అని అనుమతులు తీసుకుని మట్టిని అక్కడే ఉంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూము ల్లో చదును చేసుకోవడానికేనా మట్టి తవ్వకాలు అంటూ ప్రశ్నించారు.
వర్షాకాలంలో ఉండే ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ల హద్దులు గుర్తిస్తే తమకు న్యాయం జరుగుతుందని లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చెరువును తవ్వి మట్టిని అక్కడే పోస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా గంపల పల్లి చెరువు నుంచి గొలుసు కట్టు విధానం ద్వారా నీరు వచ్చే కాలువను మట్టితో నింపుతుంటే అధికారు లు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకే పక్షపాత ధోరణిని చూపుతుందన్నారు.
పగలు, రాత్రి తవ్వకాలు...
అనుమతులకు మించి ఎక్కువ లోతులో మట్టి తవ్వకాలు చేపట్టినట్టు, ఎక్కువ మొత్తం లో మట్టిని తరలించినట్లు మత్స్యకారులు ఆరోపించారు. గతంలో కేవలం రాత్రి మాత్ర మే తవ్వకాలు జరిపేవారని ఇప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరిగితే అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నా రు?
గతంలో ఎఫ్టీ ఎల్ సర్వే చేసినప్పుడు టాకీసు దగ్గర వరకు వచ్చిన హద్దులు నేడు టాకీస్కు వందల మీటర్ల దూరంలో ఉంటాయని ఇరిగేషన్ ఏఈ ప్రణీత్ చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఎఫ్టీఎ ల్, బఫర్ జోన్లను గుర్తించకపోతే కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకోవాలి..
కలెక్టర్ కుమార్దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దుల విషయంలో పట్టించుకుని పారదర్శకంగా పనులు జరిగేలా చూడాలని మత్స్యకారులు, రైతులు విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ అధికార యంత్రాం గం నిర్లక్ష్యం వీడటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎమ్మెల్యే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మత్స్య సహకార సంఘం నాయకులు రాజేష్, పోశయ్య, భీమయ్య, నారాయణ అంజన్న, చెరువు పరిరక్షణ సమితి కన్వీనర్ సప్ప రవి, మత్స్య కారులు గంగారాం, సత్తయ్య, నర్సయ్య, శ్రీకాంత్, వెంకటేష్, సత్యనారాయణ, నర్సయ్య, శంకర్, శ్రీనివాస్, స్వామి, కిరణ్, ఇందయ్య, నరేష్, చంద్రశేఖర్, రాజయ్యతో పాటు సుమారు 100 మంది మత్స్యకారులు, రైతులు పాల్గొన్నారు.