20 July, 2026 | 9:55 PM

ఇటు అల్లుడు.. అటు మామ మౌనం!

20-07-2026 02:23 AM

సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ నేత పోస్ట్ వైరల్

మేడ్చల్, జూలై 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకుడు క్రిశాంక్ సోషల్ మీడియా లో పెట్టిన ఓ పోస్టు చర్చనీయాంశమైంది. మైనంపల్లి.. కేటీఆర్, హరీశ్‌పై వాగితే అల్లు డు మౌనం, సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌పై వాగితే మామ మౌనం.. అని మేడ్చల్ ఎమ్మె ల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఉద్దేశించి ఓ పోస్ట్‌పెట్టారు. ఇది వైరల్‌గా మారింది. కేటీఆర్‌కు సన్నిహితుడైన క్రిశాంక్ ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం.