11 August, 2026 | 1:01 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

సింగిల్‌విండోలు బలోపేతం కావాలి

31-10-2024 12:00 AM

ఎమ్మెల్యే సత్యనారాయణ 

మానకొండూర్, అక్టోబర్ 30: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్ విండోలు) ఆర్థికంగా బలోపేతమైతే రైతులకు మేలు జరుగుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనా రాయణ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు, రిటైల్ అవుట్‌లెట్‌ను కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసి పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగిల్ విండోల అభివృద్ధిలో సంఘ సభ్యులు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వాహనదారులు, ట్రాక్టర్లు యజమానులు, సంఘ సభుయలు ఈ బంక్ ఇంధనం వాడాలని కోరారు. సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.