16-06-2025 12:00:00 AM
ఇచ్చోడ, జూన్ 15 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రయాణ ప్రాంగ ణంలో కాలు మోపాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. బురదలో కాలు వేస్తే ఎక్కడ జారిపడిపోతామొననే విధంగా ప్రయాణ ప్రాంగణం ప్రమాదకరంగా మారింది. గతంలో నిరుపయోగంగా ఉన్న ఈ బస్టాండ్ను ఇటీవల ఉపయోగంలోకి తీసుకువచ్చారు.
ప్రయాణికుల కోసం నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ను తిరిగి ఉపయోగంలోకి తీసుకువచ్చినప్పటికీ, శిథిలావస్థకు చేరిన బస్టాండ్లో చేపట్టాల్సిన మరమ్మతులు మాత్రం శూన్యంగానే ఉన్నా యి. రహదారిపై ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక దృష్టి సారించి గత కొన్ని ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రయా ణ ప్రాంగణాన్ని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువచ్చారు.
కానీ అధికారులు నామమాత్రంగానే మరమ్మత్తులు చేపట్టి ప్రయాణ ప్రాంగణాన్ని పున: ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టకపోవడంతో చిన్నపాటి వర్షానికే చెరువుల తలపించే బస్టాండ్కు రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు.
బురదమయంగా ప్రయాణీకుల ప్రాంగణం...
బస్టాండ్ ప్రాంగణంలో ఎక్కడ చూసిన బురదమయంగా మారింది. కొద్దిపాటి వర్షాలకే బస్టాండ్ పరిసర ప్రాంతంలో వరద నీరు చేరడంతో ఆ ప్రాంతం అంత బురదమయంగా మారుతోంది. దీంతో బస్టాం డుకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బురదలో ఏక్కడ కాలు వేస్తే జారీ పడతామోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాకాలం కనుక బస్సుల కోసం వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ప్రయాణ ప్రాంగణం ఆవరణలో బురద వల్ల నడవడానికి సరైన దారి లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలు మోపితే ఎక్కడ కింద పడి కాలు విరుగుతుందో అని ఆచితూచి అడుగులేస్తున్నారు.
బురదలో ప్రయాణికు లు కాలువేస్తే బట్టల పై బురద చిల్లుతుందని బస్టాండుకు రావాలంటే భయం వేస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనంపై వచ్చే ప్రయాణికులు అదుపు తప్పి బురదలో పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు వెంటనే స్పందించి బురదమయమైన ప్రయాణ ప్రాంగణంలో మరమ్మత్తులు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.