calender_icon.png 16 June, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడాలి

15-06-2025 10:55:02 PM

అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొండాజి సాయిప్రసాద్..

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కొండాజి సాయి ప్రసాద్(District President Kondaji Sai Prasad) అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఖానాపూర్ లో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కింది స్థాయిలో కూడా పటిష్టమైన నిర్మాణం ఉందని, చంద్రబాబు పాలన తెలంగాణ ప్రజలు అభిమానిస్తారని, ఆంధ్రప్రదేశ్లో లాగా ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, ఈ ప్రాంత ప్రజలకు సాగు, త్రాగు నీరు సమకూర్చింది చంద్రబాబు పాలనలోనేనని, ప్రజలు దానిని ఇప్పటికీ మర్చిపోలేదని, చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాలనా దక్షకుడని, చంద్రబాబు సుపరి పాలన తెలంగాణలో రావాలని తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అభిమానులు ఏకతాటిపైకి వచ్చి పార్టీని, కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జిల్లాలో త్వరలో కార్యాచరణ ప్రకటించి కార్యక్రమాలు ప్రారంభిస్తామని అన్నారు.