calender_icon.png 26 June, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత డిజైన్ ద్వారా సీతారామ ప్రాజెక్ట్ నీటిని జిల్లాకు అందించాలి

26-06-2025 06:20:21 PM

- జిల్లా సమగ్రభివృద్ధికి సిపిఎం దశల పోరాటాలు 

- ముగిసిన రాజకీయ శిక్షణ తరగతులు

- సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు 

ఇల్లెందు (విజయక్రాంతి): పాత డిజైన్ ద్వారా సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లా ప్రజానీకానికి అందించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సస్యశ్యామలం చేయాలని ఈ నీటి సాధన కోసం ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాల నిర్వహించడం జరిగిందని ఆ పోరాటాలలో భాగంగా సీతారామ మినీ డిస్ట్రిబ్యూటరీ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో దశల వారి పోరాటాలు రూపకల్పన చేస్తున్నామని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు(CPM District Secretary Macha Venkateswarlu) పిలుపునిచ్చారు. సిపిఎం కార్యాలయం ఏలూరి లక్ష్మీనారాయణ భవన్ లో ఇల్లందు మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు గురువారం జరిగాయి.

సిపిఎం ఇల్లందు మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ ప్రిన్సిపల్ గా వ్యవహరించిన ఈ శిక్షణ తరగతులలో పార్టీ నిర్మాణం పని పద్ధతులు అనే అంశం పైన పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు బోధించారు. అదేవిధంగా సోషల్ మీడియా పార్టీ కర్తవ్యాలు అనే అంశం మీద పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బ్రహ్మచారి క్లాసులను బోధించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పరిధిలో కాలువలను తవ్వడానికి నిధులు మంజూరు అయ్యాయని ప్రజల ఆకాంక్ష మేరకు ఈ జిల్లా ప్రజానీకం మొత్తానికి సీతారామ ప్రాజెక్టు నీటిని అందించే విధంగా ప్రాజెక్టును నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న రైతాంగం, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సీతారామ ప్రాజెక్టును పాత డిజైన్ ద్వారా నిర్మించే విధంగా పోరాట నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏజెన్సీ జిల్లా అయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇలాకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయొద్దని ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎకరం తడిచే విధంగా ఈ సీతారామ ప్రాజెక్టును నిర్మించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్టులో భూముల కోల్పోయిన వారికి 2013 భూ సేకరణ చట్టం క్రింద నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతులలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఈ శిక్షణ తరగతుల విజయవంతంకు కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, కార్యదర్శివర్గ సభ్యులు తాళ్లూరు కృష్ణ, మన్నెం మోహన్ రావు, సుల్తానా, సంధ్య, మరియా, ఖాదర్, మాదారపు వెంకటేశ్వర్లు, కోడెం బోస్, వెంకటమ్మ, ఫాతిమా, తాళ్లూరి పద్మ, తదితరులు పాల్గొన్నారు.