23-05-2025 03:16:50 PM
అమరావతి: ప్రకాశం జిల్లాలో(Prakasam district) శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఒక లారీ కారును ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాలోని స్టూవర్ట్పురం నివాసితులు అయిన బాధితులు మహానంది ఆలయాన్ని సందర్శించి ఇంటికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.