30-04-2025 12:00:00 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణంలో అనాధ వ్యక్తి అనారో గ్యం తో మరణించగా చిరు వ్యాపారులు ఏకమై అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గారే వీరన్న (30) అనే వ్యక్తి అంబేద్కర్ సెంటర్లో వివిధ షాపుల యజమానులు చెప్పిన పని చేస్తూ, వైశ్య సత్రానికి కాపలాగా ఉండేవాడు.
ఈ క్రమంలో కుదురుల క్రితం అనారోగ్యానికి గురికాగా మహబూబాబాద్ జిల్లా ఆసుప త్రికి తరలించి చికిత్స చేయిస్తు న్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మరణిం చగా వీరన్న మృతదేహాన్ని కేసముద్రంకు తీసుకువచ్చి అంబేద్కర్ సెం టర్ లో ఉన్న చిరు వ్యాపారులు అంతా సమిష్టిగా ఏకమై వీరన్న మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించారు.