16 March, 2026 | 11:55 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

దోమకొండలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

16-04-2025 05:16 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖలో అందించిన ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు దోమకొండ మండల కేంద్రంలో వ్యాధులు పశువులకు రాకుండా అసిస్టెంట్ డైరెక్టర్, డాక్టర్ శివ ఆధ్వర్యంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం(Immunization Program) నిర్వహించారు. కార్యక్రమంలో 42 గేదెలు, ఎనిమిది ఆవులకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు పశువైద్య సిబ్బంది రమేష్ బాబులతో ఇప్పించారనీ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల ఎనిమిది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ టీకాల కార్యక్రమం మే 14 తేదీ వరకు ప్రతి గ్రామంలో చేపట్టడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పాడి, పశు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.