31-05-2025 11:34:57 PM
హిందుస్థాన్ ఏరోనటికల్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ..
ఖైరతాబాద్ (విజయక్రాంతి): కోర్టు ఆదేశాలకు లోబడి సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించినప్పుడే న్యాయం జరుగుతుందని హిందుస్థాన్ ఏరోనటికల్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ(Hindustan Aeronautics Employees Cooperative Housing Society) సభ్యులు ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ అధ్యక్ష ఉప అధ్యక్షులు నాగేశ్వరరావు,కే,కే ప్రసాద్, సెక్రటరీ పృథ్వీరాజులు, ట్రెజరర్ రఘునందన్ రావు, మాజీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మిలు మాట్లాడారు. కమిటీలో సభ్యత్వం ఉండి భూములను అమ్ముకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలు జరగకుండా 2020 నుంచి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
1982లో సర్వే నంబర్ 77 హఫీజ్ పేట్ గ్రామంలో సుమారు 62 ఎకరాల భూమిని 865 మంది కొనుగోలు చేశామని అన్నారు. 80 శాతం హెచ్ సి ఎల్ ఉద్యోగులకు ఇవ్వగా మిగిలిన 20% హెచ్ఎంటి ఇతర ప్రైవేటు సంస్థలకు కేటాయించడం జరిగింది అన్నారు. పూర్తిగా ఎన్నికల్లో సభ్యులుగా కోర్టు పరిధిలో ఉన్న సంఖ్య ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నింటికి ఓ పులిస్టాప్ పడుతుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.ఆ దిశగా ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వాలని అప్పుడే తమకు సత్వర న్యాయం లభిస్తుందని అన్నారు.
ఓటు హక్కు లేని వారి లిస్ట్ తొలగించి చనిపోయిన 56 మంది స్థానాల్లో తప్పుడు లిస్టు ఇచ్చి 26 మంది ఓటర్లను తయారుచేసిన ప్రస్తుత అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి కమిటీ విధానాలకు సైతం ఎండు కార్డు పాడుతుందని అన్నారు. ప్రవేటు వ్యక్తులు భూకబ్జాకు పాల్పడ్డారని ఆ తీర్పులు కూడా కోర్టులో కొన్ని రోజులలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అన్నారు.న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని 40 ఏళ్లుగా పోరాటం చేస్తూ అనేకమంది చనిపోయినప్పటికీ న్యాయం జరగకుండా సొసైటీలు కనుమరుగైతున్నాయని మానవత దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి నిర్ణయం తీసుకుని తమకు సహకారం అందించాలని కోరారు.