calender_icon.png 19 June, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమ్మించి విక్రయించారు

19-06-2025 12:00:00 AM

  1. ఆధార్ అప్డేట్ తో వెలుగులోకి..

మధ్యప్రదేశ్‌కు మహిళల అక్రమ తరలింపు 

9 మందిపై కేసు నమోదు

పోలీసుల అదుపులో ఆరుగురు, పరారీలో ముగ్గురు.. 

మధ్యప్రదేశ్‌కు వెళ్లిన పోలీస్ బృందం

కుమ్రం భీం  ఆసిఫాబాద్,జూన్ 18(విజయ క్రాంతి): అమాయకులైన యువతుల ను నమ్మించి మభ్యపెట్టి మధ్యప్రదేశ్‌కు అక్రమంగా తరలించి విక్రయించిన సంఘటన బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిం ది. మహిళల అక్రమ తరలింపుపై బుధవా రం పోలీస్‌స్టేషన్‌లో స్థానిక సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  డీఎరామానుజన్ వివ రాలు వెల్లడించారు.

ఆసిఫాబాద్ మండలంలోని వాడిగొందికి చెందిన యువతి సంవ త్సరం క్రితం తప్పిపోగా ఆమె తండ్రి తన కూతురు కోసం గాలిస్తున్నాడు. సదరు మహిళ గత నెలలో ఆధార్ కార్డు అప్డేట్ చేయగా అది బాధితురాలు ఇంటికి పోస్టులో వచ్చింది. కార్డుపై ఉన్న ఫోన్ నెంబర్‌కు డయల్ చేయగా మధ్యప్రదేశ్‌కి చెందినదని తెలియడంతో బాధితురాలు తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇది తెలుసుకు న్న జిల్లా కేంద్రంలోని మరో బాధితురాలు పోలీసులను కలిసి ఫిర్యాదు చేయగా బాధితురాలు ఫిర్యాదు మేరకు పలువురు అను మానితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీనికి సం బంధం ఉన్న 9 మంది నిందితులను గుర్తించగా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

మొదటి యువతని రూ. లక్ష ౩౦ వేలకు అమ్మి వేయగా, రెండవ యువతిని రూ.లక్ష పదివేలకు అమ్మి వేసిన ట్లు తెలిపారు. 9 మంది నిందితులలో ఐదుగురు మహిళలు కాగా నలుగురు పురుషులు ఉన్నారు.

అదుపులోకి తీసుకున్న నిందితులలో ఏ1 ముద్దాయిగా మంచిర్యాలలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పరికిపండ్ల విజయలక్ష్మి, ఏ 2 ముద్దాయిగా జిల్లా కేంద్రం లోని టిఆర్‌నగర్‌కు చెందిన సత్యంశెట్టి సుజాత, ఏ3 రాజంపేటకు చెందిన పంచపుల, ఏ4 గా వాంకిడి మండలం బెండరకు చెందిన తాడూరి ఉష, ఏ 5గా సస్పెండ్ అయిన కానిస్టేబుల్ హరిదాస్, ఏ 6గా మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన దుర్గం సుధాకర్ లను అదుపులోకి తీసుకొని విచారి స్తున్నట్లు, పరారీలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని జావ్రాకు చెందిన ఏ 7 రమేష్ గౌడ్, ఏ8గా సురేఖ ఏ9 గా జగదీష్‌లు ఉన్నారని తెలిపారు

పరారీలో ఉన్న వీరి కోసం ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్ వెళ్లినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్స్ తో పాటు 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిలో హరిదాస్, సురేఖ పదేపదే ఇటువంటి కేసులలో నిందితులుగా ఉన్నారని వివరించారు.

బాధిత మహిళలు ఇద్దరు ఎస్టీలు కావడంతో ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు, మానవ అక్రమ రవాణా కేసుల ను, లైంగిక నేరాల కేసు, అనైతిక నేరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఒంటరి మహిళలను, పెళ్ళికానివారిని, భర్త చనిపోయిన వారిని లక్ష్యంగా ఇటువంటి ముఠాలు పనిచేస్తున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఎవరైనా అటువంటి వారు కనిపిస్తే సమాచారం అందించాలని తెలిపారు.