calender_icon.png 19 June, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లొట్టపీసు కేసుకే కేటీఆర్‌కు భయమెందుకు..?

18-06-2025 11:30:43 PM

పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం..

హైదరాబాద్ (విజయక్రాంతి): ఎన్ని కేసులైనా పెట్టుకోండి అంటున్న కేటీఆర్.. నువ్వు ఏమైనా స్వతంత్రం కోసం కోట్లాడినావా..? అని పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం(PCC official spokesperson Satyam Srirangam) విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేస్తేనే పోలీసులు కేసులు పెట్టారని తెలిపారు. లొట్టపీసు కేసు అంటున్న కేటీఆర్..  ఆ లొట్టపీసు కేసులకే కేటీఆర్, హరీష్‌రావులకు భయం పట్టుకుందని ఆయన తెలిపారు.

ఈ ఫార్ములా కార్ కేసులో తాను ఆదేశిస్తేనే అరవింద్‌ కుమార్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు విచారణ అంటే ఎందుకు భయపడుతున్నాడని ఆయన నిలదీశారు. ఏసీబీ అధికారులకు సెల్‌ఫోన్లు ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన కోరారు. బీఆర్‌ఎస్ హయాంలో రేవంత్‌ రెడ్డిపైన పెట్టిన కేసులను సింగిల్‌గానే ఎదుర్కొన్నాడని సత్యం శ్రీరంగం చెప్పారు. రేవంత్‌రెడ్డిది సన్నాసి పాలన అంటున్న కేటీఆర్.. అసలు సన్నాసులు కేటీఆర్, హరీష్‌రావులేనని ఆయన  విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమైన చర్య అని, ఇతరుల హక్కులను హరించే ధైర్యం మీకు ఉందా..? అని ఆయన నిలదీశారు.