11-06-2025 04:34:08 PM
నడిగూడెం: వచ్చే వానాకాలం సీజన్ నుండి ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని సిరి ఫౌండేషన్(Siri Foundation) వ్వవస్థాపకులు డాక్టర్ మొలుగూరి గోపయ్య(గోపి) కోరారు. బుధవారం మండల పరిధిలోని వెంకట్రాంపురంలో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా గోవులకు, నాగలికి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... రోజురోజుకు మన జీవన విధానాన్ని మార్చుకోవాలన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాగులో అనేక మార్పులు వచ్చాయని దీంతో జబ్బులతో బాధపడుతున్నమన్నారు. గత 60 ఏళ్లుగా చేస్తున్న రసాయన వ్యవసాయంతో నేల పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. కాబట్టి నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యమే మన ఆరోగ్యం అన్నారు. అనంతరం గో పూజ, రైతు ఆరోగ్యమే మన ఆరోగ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అన్వర్, పి ఎన్ పి. ప్రతినిధులు దున్న నాగరాజు, పేరెల్లి ఉపేందర్, రైతులు బాదె సోమయ్య, చిత్తలూరి శ్రీనివాసరావు, లక్షమయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, లింగయ్య, ప్రమీల, పద్మ, మణెమ్మ పాల్గొన్నారు.