calender_icon.png 29 June, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తంగా విద్యారంగం

29-06-2025 01:03:55 AM

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, విద్యారంగ సమస్యలు అధికారులకు చెప్పిన పరిష్కారం కావడం లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు 18 నెలలైనా ఒకటి అమలు కాలేదని, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ, ప్రతి విద్యార్థికి ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్, విద్యాజ్యోతి పథకం  హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందుతుందని, కేజీ పాఠశాల నుండి ప్రవేట్ యూనివర్సిటీ వరకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తమ అధికారంలో వస్తే ఫీజు బకాయిలు ఒకేసారి విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో, బడ్జెట్ కళాశాల టీచింగ్ స్టాఫ్ కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల  చేయాలని, ప్రభుత్వ పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, కేజీబీవీ , సంక్షేమ హాస్టళ్లలో ఆహార నాణ్యత పాటించేలా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్  టీం నియమించి  నిత్యం తనిఖీలు నిర్వహించాలని,  పెరిగే నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ చార్జీలు మరింత పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులల్లో విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు.