25-06-2025 09:40:06 AM
హైదరాబాద్: మెదక్ జిల్లా(Medak district) హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో(Aurangabad Thanda) అమానుషఘటన చోటుచేసుకుంది. రైతు భరోసా డబ్బులివ్వలేదని కుమారుడు తండ్రి నాలుక కోసేశాడు. తండ్రి బానోత్ కీర్యా ఖాతాలో రూ. 9 వేలు రైతు భరోసా నగదు జమ అయింది. వైద్య ఖర్చులకు తండ్రి కీర్యా రూ. 5 వేలు తన దగ్గర ఉంచుకున్నాడు. రైతు భరోసా నగదులో మిగిలిన రూ. 4 వేలను కొడుకుకు ఇచ్చేశాడు. రైతు భరోసా నగదు మొత్తం ఇవ్వాలని తండ్రి కీర్యాతో కొడుకు సంతోష్ గొడవకు దిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను తండ్రిని కొట్టడమే కాకుండా గొడ్డలితో నాలుక కోసేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కీర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.