calender_icon.png 30 June, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్తమామలను నరికి చంపిన అల్లుడు

30-06-2025 10:08:00 AM

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) నెల్లూరు జిల్లాలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఓ అల్లుడు అత్తమామలను కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. అల్లుడి దాడిలో అత్తమ్మ జయ(60), మామ కల్లయ్య(65) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా(Nellore District) దుత్తలూరు ఎస్టీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యపై కత్తితో దాడి చేస్తుండగా అత్తమామలు అడ్డుకున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తమామలను అల్లుడు వెంగయ్య అంతమొందించాడు. ఘటన తర్వాత నిందితుడు వెంగయ్య అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.