ఢిల్లీలో ఓటు వేసిన సోనియా, రాహుల్ గాంధీ
25-05-2024 10:54 AM
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం దేశంలో ఆరో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 58 లోక్సభ స్థానాలకు 889 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. ఢిల్లీ 7, హర్యానా 10, యూపీ 14, పశ్చిమబెంగాల్ 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. బీహార్లో 8, ఒడిశా 6, జార్ఖండ్ 4, జమ్మూకశ్మీర్లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాకముందే ప్రజలు పోలింగ్ స్టేషన్ల వెలుపల క్యూలో నిల్చున్నారు.






