వేసవి ప్రత్యేక రైళ్లు, మరింత సౌకర్యం!
న్యూఢిల్లీ: వేసవి కాలంలో కీలక మార్గాల్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway ) ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించింది. వేసవి కాలంలో ప్రయాణ రద్దీని తగ్గించడం, ప్రధాన గమ్యస్థానాల మధ్య అదనపు అనుసంధానాన్ని కల్పించడం ఈ పొడిగింపు లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని, ఈ ప్రత్యేక సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
పండుగలు, వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే తిరుపతి, చర్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, కాకినాడ వంటి కీలక గమ్యస్థానాలకు అదనపు వేసవి ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పొడిగించబడిన రైల్వే సేవలు ఇవే
రైలు నెంబర్ 06557 (SMVT బెంగళూరు – శాంత్రాగాచి) ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 24 వరకు శుక్రవారాల్లో 3 సర్వీసులు నడుస్తుంది.
రైలు నెంబర్ 06558 (సంత్రగాచి – బెంగళూరు కాంట్.) ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 26 వరకు ఆదివారాల్లో 3 సర్వీసులు నడుస్తుంది .
రైలు నెంబర్ 06207 (బెంగళూరు కాంట్ – కలబురగి) ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 25 వరకు శనివారాల్లో 3 సర్వీసులు నడుస్తుంది .
రైలు నెంబర్ 06208 (కలబురగి – బెంగళూరు కాంట్.) ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 26 వరకు ఆదివారాల్లో 3 సర్వీసులు నడుస్తుంది.
రైలు నెంబర్ 06539 (SMVT బెంగళూరు – బీదర్) ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు,ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 26 వరకు శుక్రవారాలు, ఆదివారాల్లో (6 సర్వీసులు) నడుస్తుంది.
రైలు నెంబర్ 06540 (బీదర్ – SMVT బెంగళూరు) ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 13 వరకు, ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 27 వరకు శనివారాలు, సోమవారాల్లో 6 సర్వీసులు నడుస్తోందని అధికారులు పేర్కొన్నారు.





