28-07-2025 10:09:40 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కురవి మండలం అయ్యగారి పల్లికి చెందిన సంజీవరెడ్డికి ఎస్ఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు సంజీవరెడ్డికి ఎస్ఐగా పదోన్నతి పొందినందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) స్టార్ భుజంపై అలంకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి సిఐ చంద్రమౌళి పాల్గొన్నారు.