17-05-2025 08:15:16 PM
కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్..
నల్లగొండ (విజయక్రాంతి): నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించాలని కోరుతూ డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ శనివారం కలెక్టర్ త్రిపాఠినీ ఆమె చాంబర్ లో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కొరకు కోర్టు ఎదురుగా ఉన్న మెలోడీ భవనం స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేసిన వారిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, చలపతిరావు తదితరులు ఉన్నారు.