21-06-2025 05:16:22 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్టీసీ ఆధ్వర్యంలో బాలాజీ, భీమ్ విహారయాత్రను ఈనెల 27న ప్రారంభిస్తున్నట్టు ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కె.వి రాజశేఖర్(RTC Depot Manager KV Rajasekhar) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ నుండి ఉదయం 8 గంటలకు ప్రారంభమై 9 గంటలకు రెబ్బెన మండలం గంగాపూర్ లోని బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం, జీవనదిలో పుణ్యస్నానం ఆచరించవచ్చన్నారు.
అక్కడి నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు కెరమేరి మండలంలోని జోడేఘాట్ బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకు ఆసిఫాబాద్ కు చేరుకుంటారని వివరించారు. మొత్తం ఈ ప్రయాణం 170 కిలోమీటర్లు ఉంటుందని ఇందుకు పెద్దలకు 280 రూపాయలు, పిల్లలకు 140 రూపాయలు ధర నిర్ణయించినట్టు తెలిపారు. టికెట్లు బస్సులోనే ఇవ్వబడును ఆసక్తి గలవారు ఈ నెల 27న ఉదయం 7:45 నిమిషాలకు ఆసిఫాబాద్ బస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయగలరు. మరిన్ని వివరాలకు 6300489162, 9959226006 నెంబర్లను సంప్రదించాలనీ పేర్కొన్నారు.