21-06-2025 05:18:51 PM
మాజీ మంత్రి జోగు రామన్న..
అదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ఆత్మ గౌరవం కోసం నిరంతరం అవిశ్రాంతిగా పోరాటం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి జోగు రామన్న(Former Minister Jogu Ramanna) అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ లోని ఆయాన విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ... జయశంకర్ సార్ చూపిన స్ఫూర్తితో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి బంగారు తెలంగాణగా సాధించడం జరిగిందన్నారు. తెలంగాణ విద్యావంతులు, యువత అనేక రంగాలలో సత్ఫలితాలలో భాగంగా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలను పొందడం జరుగుతుందన్నారు.
ఆయన చేసిన ఈ నీటి జలాల ఉద్యమం ఫలితమే నేడు ఇంటింటికి మిషన్ భగీరథగా త్రాగునీటిని అందుతుందన్నారు. జయశంకర్ సార్ సిద్ధాంతాలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. ఆయన కలలు గన్న తెలంగాణ ఆత్మగౌరవనీ, తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుల పలు చేయడం జరుగుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు యూనుస్ అక్బనీ, మెట్టు ప్రహ్లాద్, అజయ్, అశోక్ స్వామి, ఇజ్జగిరి అశోక్, మేస్త్రం పరమేశ్వర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.