12-06-2025 12:15:41 AM
పీఏం జన్ మాన్ , డి.ఏ.జే.జి.యూ.ఏ నిర్వహణ పై సమీక్ష లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూన్11(విజయ క్రాంతి) జూన్ 20న గిరిజన గ్రామాల్లో స్పెషల్ క్యాంపు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టరేట్ లో పీఏం జన్ మాన్, డి.ఏ.జే.జి. యూ.ఏ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు క ల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్ మాన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ్ మహా అభియాన్), డి.ఏ.జే.జి.యూ.ఏ (దరతి ఆభా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్) కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే.సంగీత ,జిల్లా అటవీ అధికారి శివయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, సంబంధిత అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.