12-06-2025 12:16:09 AM
- ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీబీపీ స్కీములు కొనసాగించాలి
- మత్స్యకారులకు 90 శాతం సబ్సిడీలతో రుణాలు ఇవ్వాలి
- టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లెల బాలకృష్ణ
మంచిర్యాల, జూన్ 11 (విజయక్రాంతి): మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలకు బదులుగా మత్స్య సొసైటీల అకౌంట్లలో నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం (టీఎంకేఎంకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేల్లెల బాలకృష్ణ అన్నారు.
బుధవారం మంచిర్యాల చార్వక హాస్పిటల్లో మత్స్యకారుల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీబీపీ స్కీములు పునరుద్ధరించాల ని, తద్వారా మత్స్యకారులకు టు వీలర్స్, ఫోర్ వీలర్స్ వాహనాలు 90% సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని, మత్స్యకారులు సహజంగా మరణిస్తే ఇన్సూరెన్స్, ఎక్స్ గ్రేషీయో లాంటి స్కీంలు అమలు జరగడం లేదన్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీలు చిన్న చిన్న కారణాలు చెప్పి వచ్చే ఇన్సూరె న్స్, ఎక్స్ గ్రేషియా ఇవ్వడం లేదని, ఇలాంటి చర్యల వల్ల పేద మత్స్యకారుల కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం లో 10 ఎకరాల స్థలం కేటాయించి రూ. 10 కోట్లతో అధునాతన చేపల మార్కెట్ నిర్మించాలని డిమాండ్ చేశా రు. జల వనరులను, రిజర్వాయర్లను మత్స్యకారుల నుంచి దూ రంచేసి పెద్దపెద్ద కార్పొరేట్లకు అప్పగిస్తున్నారన్నారు.
వేలాది మంది మత్యకారులను గంగమ్మకు, చేపల వేటకు దూరం చేస్తూ మత్స్యకారుల పొట్టలుకొడుతున్నారని విమర్శించారు. మత్స్యకారుల సమస్యలను పరి ష్కరించాలని లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోడెంకి చందు, మత్స్యకార నాయకులు గుమ్ముల శ్రీనివాస్, పెద్దప ల్లి మధునయ్య, బోడెంకి మహేష్, పందిరి రమాదేవి, నేన్నెల మల్లేశ్వరి, పానేం రాజన్న, గగ్గూరి రాజన్న, జింక బాపు, నాగుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.