17-02-2026 12:23:47 AM
సికింద్రాబాద్, ఫిబ్రవరి ౧6 (విజయక్రాం తి): బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. శివరాత్రికి కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘట న బేగంపేట పరిధి శ్యామ్లాల్ వద్ద చోటు చేసుకుంది. 30 తులాల బంగారం, 2 కిలోలు వెండి, రూ.50 వేల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బేగంపేట శ్యామ్ లాల్ వద్ద సత్యసాయి సిరి సంపద అపార్ట్మెంట్స్ మూడవ అంతస్తు 302, ప్లాట్లో వృద్ధురాలు ఎం.అనురాధ (60) ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కూతురు ఇంటికి వెళ్లి ఉదయాన్నే తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో పాటు బీరువాలో ఉన్న బంగారం వెండి నగదు కనిపించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు జరిగిన తీరును పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సిసి కెమెరాల లో నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.