17 March, 2026 | 4:34 PM

Breaking News

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   పదవ తరగతిలో 100% ఫలితాలు   •   చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ   •   నందిని సిధారెడ్డికి సీఎం రేవంత్ శుభాకాంక్షలు   •   బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం   •   ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అస్తవ్యస్త వైద్య సేవలు: బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం   •   తెలంగాణలో హ్యామ్ రోడ్ల పేరిట రూ. 18 వేల కోట్ల స్కామ్   •   ఆత్మగౌరవం చంపుకొని ఉండలేను.. ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయటకు పంపాలి   •   కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ నెంబర్   •  

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలాప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి

09-12-2025 12:00 AM

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

కామారెడ్డి, డిసెంబర్ 8, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని దోమకొండ మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ ను జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్  సోమవారం సందర్శించారు. ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత ఎన్నికల సిబ్బందితో మాట్లాడి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పారదర్శకంగా, సక్రమంగా కొనసాగుతున్న విధానం పై వివరాలు తెలుసుకున్నారు.

ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు  2025 కోసం పోస్టల్ బ్యాలెట్ పత్రాల పంపిణీ  స్వీకరణ పై వివరాలు కామారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు2025 సందర్భంలో అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం కల్పించే కార్యక్రమం పారదర్శకంగా, సక్రమంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  తెలిపారు.

జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టామని, ప్రతి దశలో ఎన్నికల సిబ్బంది సకాలంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చందర్, ఆర్డీఓ వీణ, డీ ఎల్ పి ఓ శ్రీనివాస్, ఎన్నికల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.