16 April, 2026 | 12:44 PM

బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయండి

25-11-2025 12:00 AM

-ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్

రాజేంద్రనగర్, నవంబర్ 24 (విజయక్రాంతి) : మైలార్ దేవ్ పల్లి రైల్వే ట్రాక్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం జిహెచ్‌ఎంసి దక్షిణ మండల జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.