02-06-2025 07:36:11 PM
ఎంఈఓ భాస్కర్..
వలిగొండ (విజయక్రాంతి): క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి దోహదపడతాయని ఎంఈఓ సుంకోజు భాస్కర్(MEO Sunkoju Bhaskar) అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేసవి క్రీడల శిక్షణ తరగతుల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ మాట్లాడుతూ... నేటి ఆధునిక కాలంలో విద్యార్థినీ, విద్యార్థులు, యువత ఎక్కువగా సెల్ ఫోన్ లకు బందీ అవుతున్నారని దీంతో స్థూలకాయం, బుద్ధి మాంద్యం కంటి సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. కానీ క్రీడలతో వీటన్నింటిని నివారించే అవకాశం ఉందని ఇప్పటికైనా విద్యార్థిని, విద్యార్థులు, యువత క్రీడల వైపు మొగ్గు చూపాలని అన్నారు.
వేసవి క్రీడల్లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి వలిగొండ మండల కాంగ్రెస్ నాయకుడు అయిటిపాముల రవీంద్ర వేలాది రూపాయలను వెచ్చించి బహుమతులను అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ధనుంజయ, ఉపాధ్యాయులు పోలేపాక నాగేందర్, ఎండి జిలాని, లింగయ్య, రాము, ఐలయ్య, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు శ్రీనివాస్, బత్తిని నగేష్, శ్యామల సాయి తదితరులు పాల్గొన్నారు.