ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

25-04-2024 12:52:04 AM

హైదరాబాద్, ఏప్రిల్‌౨౪ (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో శ్రీచైతన్యస్టేట్ ఫస్ట్ మార్క్ ౨౬ మందికి ౪౬౮ మార్కులు, ౪౬౭ ఆపై మార్కులు ౪౨౨ మందికి, ౪౬౬ ఆపై మార్కులు ౧,౧౦౦ మందికి, ౪౬౦ ఆపై మార్కులు ౩,౮౨౨ మందికి వచ్చాయని శ్రీచైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ తెలిపారు. బైపీసీలో ౪౩౮ మార్కులు ౧౯ మందికి, ౪౩౭ ఆపైన మార్కులు ౧౬౨ మందికి, ౪౩౬ ఆపై మార్కులు ౪౦౪ మందికి, ౪౩౫ ఆపైన మార్కులు ౬౩౧ మందికి, ౪౩౦ ఆపైన మార్కులు ౧౬౨౪ మందికి వచ్చాయని వెల్లడించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో శ్రీచైతన్య స్టేట్ ఫస్ట్ మార్క్ ౯౯౩ మార్కులు ఐదుగురికి, బైపీసీలో ౯౯౪, ౯౯౦ ఆపై మార్కులు ౮౩ మందికి వచ్చాయని వెల్లడించారు. ౯౮౦ ఆపై మార్కులు ౧౫౬౬ మంది సాధించారని తెలిపారు.

ఎన్టీఏ విడుదల చేసిన కీ ప్రకారం జేఈఈ మెయిన్ నలుగురు విద్యార్థులు ౩౦౦ కు ౩౦౦ మార్కులు సాధించడంపట్ల హర్షం వ్యక్తంచేశారు.  శ్రీచైతన్య సృష్టించిన పటిష్ట ప్రోగ్రాంలు, సరైన ప్రణాళిక, అధ్యాపకుల శిక్షణతో అత్యుత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.